Narendra Modi: ఇజ్రాయెల్ హ‌మాస్ యుద్ధంలో ప్ర‌జ‌లు చ‌నిపోవ‌డాన్ని ఖండిస్తున్నా

Narendra Modi: హ‌మాస్‌పై ఇజ్రాయెల్  (israel hamas war) యుద్ధం చేస్తున్న నేప‌థ్యంలో వేలాది మంది పౌరులు చ‌నిపోయారు. ఈ ఘ‌ట‌న‌పై ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ గ్లోబ‌ల్ స‌మ్మిట్ స‌మావేశంలో మాట్లాడుతూ స్పందించారు. ఈ యుద్ధంలో పౌరులు చ‌నిపోవ‌డానికి తీవ్రంగా ఖండిస్తున్నాన‌ని తెలిపారు. గ‌తంలో హ‌మాస్ ఇజ్రాయెల్‌పై దాడి చేయ‌డం మొద‌లుపెట్ట‌డంతో ఇప్పుడు ఇజ్రాయెల్ గాజాలో న‌క్కిన హ‌మాస్‌పై దాడుల‌కు పాల్ప‌డుతోంది. ఈ యుద్ధ నేప‌థ్యంలో భార‌త్ ఇజ్రాయెల్‌కు మ‌ద్ద‌తుగా నిలిచింది. అలాగ‌ని ఇజ్రాయెల్ పౌరుల గురించి ఆలోచించ‌కుండా ఇష్ట‌మొచ్చిన‌ట్లు దాడులు చేయ‌డం స‌బ‌బు కాద‌ని మోదీ అభిప్రాయ‌ప‌డ్డారు.