Telangana Elections: త‌గ్గేదేలే..!

Telangana Elections: కాంగ్రెస్‌కు కొత్త త‌ల‌నొప్పి మొద‌లైంది. “” సూర్యాపేటలో దామోదర్ రెడ్డిని ఎట్టి పరిస్థితుల్లో గెలవనివ్వను.. నేను పోటీలో ఉంటాను. పోటీ నుండి తప్పుకోమని నన్నెవరూ అడగలేదు. రేవంత్ రెడ్డి కూడా నాతో మాట్లాడలేదు. బుజ్జగింపులకు తలొగ్గేది లేదు “” అంటూ పటేల్ రమేష్ రెడ్డి ప‌ట్టుబ‌ట్టారు. మ‌రో ప‌క్క జంగా రాఘ‌వ రెడ్డి.. “” నన్ను మోసం చేసి నాయిని రాజేందర్ రెడ్డికి టికెట్ ఇచ్చారు. వరంగల్ వెస్ట్‌లో నాయినిని గెలవనివ్వను.. పోటీ నుండి వెనక్కి తగ్గను “” అంటూ ఆయ‌న స‌వాల్ విసురుతున్నారు. దాంతో అంత‌ర్గ‌త స‌మ‌స్య‌లు త‌లెత్తుతున్నాయి.