Bihar: పోలీస్ దారుణ హ‌త్య‌.. మంత్రి షాకింగ్ రియాక్ష‌న్

Bihar: ఓ పోలీస్‌ని ట్రాక్ట‌ర్‌తో తొక్కించి దారుణంగా చంపేస్తే.. ఓ మంత్రి చేసిన వ్యాఖ్య‌లు సంచ‌ల‌నం సృష్టిస్తున్నాయి. బిహార్‌లోని జాముయ్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. మ‌హూలియా గ్రామంలో కొంద‌రు వ్య‌క్తులు ఇసుక అక్ర‌మాల‌కు పాల్ప‌డుతున్నార‌ని తెలిసి ప్ర‌భాత్ రంజన్ అనే పోలీసు అడ్డుకునేందుకు మ‌రో ఇద్ద‌రు గార్డుల‌ను తీసుకుని వెళ్లాడు. ఇసుక‌ను త‌ర‌లించ‌డానికి వీల్లేదు అని ట్రాక్ట‌ర్‌ను అడ్డుకోగా.. ఆ వ్య‌క్తులు అమానుషంగా ఎదురుగా నిల‌బ‌డిన ప్ర‌భాత్‌పైకి ట్రాక్ట‌ర్‌ను ఎక్కించారు. దాంతో ప్ర‌భాత్ అక్క‌డిక‌క్క‌డే మృతిచెందాడు. ఈ ఘ‌ట‌న‌లో ఇద్ద‌రు గార్డుల‌ను తీవ్ర గాయాల‌య్యాయి.

ఓస్ ఇంతేనా.. ఇవి కామ‌న్

ఈ విష‌యం గురించి బిహార్ విద్యాశాఖ మంత్రి చంద్ర శేఖ‌ర్ స్పందిస్తూ.. ఓస్ ఇంతేనా.. ఇవి బిహార్‌లోనే కాదు ఉత్త‌ర్‌ప్ర‌దేశ్, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో కూడా చాలా కామ‌న్. నిందితుల‌ను క‌ఠినంగా శిక్షిస్తాం అని తీసి పారేసిన‌ట్లు మాట్లాడ‌టంతో పొలిటిక‌ల్ ర‌చ్చ‌కు దారి తీసింది. పోలీసుల‌కే ర‌క్ష‌ణ లేక‌పోతే ఇక ప్ర‌జ‌ల‌ను ఏం కాపాడ‌తారు అని ప్ర‌తిప‌క్షాలు మండిప‌డుతున్నాయి.