Kodangal: రేవంత్ రెడ్డి రోడ్ షోలో ఉద్రిక్త‌త‌

Kodangal: కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి (revanth reddy) కొడంగ‌ళ్‌లో చేప‌డుతున్న రోడ్ షోలో ఉద్రిక్త‌త నెల‌కొంది. రోడ్ షోలో కాంగ్రెస్ నాయకులు కొట్టుకున్నారు. మహిపాల్ రెడ్డి వర్గీయులను గుర్నాథ్ రెడ్డి తిట్ట‌డంతో ఇరు వ‌ర్గాల మ‌ధ్య గొడ‌వ జ‌రిగింది. గుర్నాథ్ రెడ్డి తిడుతుంటే పక్కనే ఉండి పట్టించుకోరా అంటూ రోడ్డుషో చేస్తున్న వారిపై మహిపాల్ రెడ్డి వర్గీయులు ప్ర‌శ్నించారు. దాంతో గుర్నాథ్ రెడ్డితో రేవంత్ క్షమాపణలు చెప్పించారు.