TDP: క‌డుపు మంట‌తో ట్రోల్స్ చేస్తున్నారు జ‌గ‌న్…!

TDP: “” ఇప్పుడు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేవాళ్లంతా కడుపు మాడి లేదా కడుపు మండి పెట్టేవాళ్లే జగన్ రెడ్డీ… మరి వీళ్లపై కేసులు ఎందుకు పెడుతున్నావ్? ఆస్తులు సీజ్ చేస్తావా? ఇంతగా వ్యవస్థలను వాడుకుని జనాన్ని భయపెడుతున్న తమరు సీఎం పదవికి అర్హులా? “”  అంటూ తెలుగు దేశం పార్టీ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. సోష‌ల్ మీడియాలో ఏపీ సీఎం జ‌గ‌న్‌పై (ap cm jagan) కానీ ఆయ‌న ప్ర‌భుత్వ ప‌నితీరుపై కానీ ఎవ‌రైనా ట్రోల్స్ చేసినా ద‌రిద్ర‌మైన పోస్ట్‌లు పెట్టినా చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని AP CID చీఫ్‌ ఎన్ సంజ‌య్ వెల్ల‌డించారు. ఈ నేప‌థ్యంలో తెలుగు దేశం పార్టీ పై విధంగా ట్వీట్ చేస్తూ నిర‌స‌న తెలిపింది.