Ponguleti: “ఏం పీక్కుంటారో పీక్కోండి”

Ponguleti Srinivas Reddy: ఐటీ దాడులు జ‌రిగిన నేప‌థ్యంలో కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి  మీడియా ముందుకు వ‌చ్చారు. నామినేష‌న్ వేస్తున్నాన‌ని ప్ర‌క‌టించ‌గానే నా ఇంట్లో ఐటీ సోదాలు జ‌రిగాయని దాడులు చేయించ‌డం త‌ప్పు కాదు కానీ దానికి స‌మ‌యం సంద‌ర్భం ఉంటుందని అన్నారు. తాను నామినేష‌న్ వేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించ‌గానే దాడులు నిర్వ‌హించారంటే కాంగ్రెస్ అధికారంలోకి రావ‌డం ఖాయం అన‌డానికి ఇదే సంకేతమ‌ని తెలిపారు. మీరు ఏం పీక్కుంటారో పీక్కోండి. గెలిచేది మాత్రం మేమే అని ఘాటు పంచ్‌లు వేసారు.