Ponguleti: తెల్ల‌వారుజామున 3 నుంచి పొంగులేటి ఇంట్లో ఐటీ సోదాలు

ponguleti srinivas reddy: కాంగ్రెస్ పాలేరు అభ్య‌ర్ధి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు జ‌రుగుతున్నాయి. ఈరోజు తెల్ల‌వారుజామున 3 గంట‌ల‌కు ఐటీ అధికారులు ఒక్క‌సారిగా పొంగులేటి ఇంటికి చేరుకున్నారు. ఫోన్లు లాక్కుని పొంగులేటిని అత‌ని కుటుంబీకుల‌ను ఒక చోట కూర్చోపెట్టి త‌నిఖీలు నిర్వ‌హిస్తున్నారు. ఇంకా రైడ్లు కొన‌సాగుతున్నాయి. అయితే నిన్న ప్రెస్ మీట్ పెట్టిన పొంగులేటి త‌న ఇంట్లో ఐటీ సోదాలు జ‌రిగే అవకాశం ఉంద‌ని ముందే చెప్ప‌డం గ‌మ‌నార్హం. KCR త‌న‌కు వ్య‌తిరేకంగా ఎవ‌రు మాట్లాడినా వారిపై BJPతో మాట్లాడించి మ‌రీ దాడులు చేయిస్తార‌ని అన్నారు.

దాడుల‌కు ఆ వ్యాఖ్య‌లే కార‌ణమా?

అయితే మూడు రోజుల ముందు పొంగులేటి ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడారు. ఎంత సంపాదించాం అన్న‌ది ముఖ్యం కాదు పెట్టే గుణం ఉందా లేదా అనేది ముఖ్యం అన్నారు. త‌న వ‌ద్ద డ‌బ్బు ఉన్న‌ప్పుడు సాయం చేసాన‌ని లేన‌ప్పుడు అప్పు తెచ్చి మ‌రీ ఇచ్చాన‌ని అన్నారు. ఎన్నిక‌ల ముందు ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేయ‌డం కూడా ఐటీ సోదాల‌కు ఓ కార‌ణ‌మ‌నే ఓ టాక్ వినిపిస్తోంది.