విజ‌య‌వాడ‌లో అక్రమంగా తరలిస్తున్న గోల్ఢ్‌ పట్టివేత..విలువ 7 కోట్లు పైమాటే!

తమిళనాడు నుంచి ఆంధ్రప్రదేశ్‌కు బంగారం తరలిస్తున్నట్టు పక్కా సమాచారం అందుకున్న కస్టమ్స్‌ అధికారులు విజయవాడ రైల్వేస్టేసన్ వద్ద బుధవారం సాయంత్రం నిఘా పెట్టారు. ఈనేపథ్యంలో దాదాపు రూ.7.48 కోట్ల విలువైన 12.97 కిలోల బంగారాన్ని విజయవాడ రైల్వే స్టేషన్‌ వద్ద పట్టుకున్నారు. తొలుత ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి నుంచి 5 కేజీల బంగారం స్వాధీనం చేసుకున్నారు. అదుపులో ఉన్న వారు ఇచ్చిన సమాచారంతో మరి కొందరిని అదుపులోకి తీసుకుని 7.97 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ మొత్తం కలిపి 12.97 కిలోలు ఉన్నట్లు సమాచారం. పట్టుబడిన బంగారంలో కొంత బిస్కెట్ల రూపంలో మరికొంత ఆభరణాల రూపంలోను ఉన్నట్టు కస్టమ్స్‌ అధికారులు గుర్తించారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు.