YS Sharmila: కాళేశ్వ‌రం స్కాం గురించి తెలిసీ BJP మౌనంగా ఎందుకుంది?

Telangana Elections: ప్ర‌పంచంలోనే అతిపెద్ద ప్రాజెక్ట్ అయిన కాళేశ్వ‌రంలో (kaleswaram) దేశంలోనే అతిపెద్ద స్కాం జ‌రిగింద‌ని అన్నారు YSRTP అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిళ‌ (ys sharmila). ఈ ప్రాజెక్ట్‌లో స్కాం జ‌రుగుతోంద‌ని రాష్ట్ర‌ప‌తి ద‌గ్గ‌ర్నుంచి అంద‌రికీ లేఖ‌లు పంపామ‌ని కానీ ఎవ్వ‌రూ స్పందించ‌లేద‌ని అన్నారు. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ చేతిలో ED, అమిత్ షా చేతిలో IT ఉన్న‌ప్పుడు కాలేశ్వ‌రం ప్రాజెక్ట్ విష‌యంలో ఇప్ప‌టివ‌ర‌కు ఎందుకు ఎలాంటి రైడ్లు చేయ‌లేద‌ని ప్ర‌శ్నించారు. BJP, BRS పార్టీలు దొందూ దొందేన‌ని.. AIMIM పార్టీ బ‌హిరంగంగా BRSకి స‌పోర్ట్ చేస్తుంటే BJP మాత్రం తెర‌వెనుక ఉండి మ‌రీ KCRను కాపాడుతోంద‌ని ఆరోపించారు.