Vizianagaram: ఘోర రైలు ప్ర‌మాదం.. ముగ్గురి మృతి

ఏపీలోని విజ‌య‌న‌గ‌రంలో (vizianagaram) ఘోర రైలు ప్ర‌మాదం చోటుచేసుకుంది. రాయ‌గ‌డ‌ (rayagad) నుంచి విశాఖ‌ప‌ట్నం (vizag) వెళ్తున్న ప్యాసెంజ‌ర్ రైలు అల‌మంద‌-కంట‌క‌ప‌ల్లి ప్రాంతంలో ప‌ట్టాలు త‌ప్పింది. దాదాపు మూడు బోగీలు ప‌ట్టాలు త‌ప్పిన‌ట్లు అధికారులు తెలిపారు. ఈ ప్ర‌మాదంలో ముగ్గురు మృతిచెంద‌గా ప‌లువురికి తీవ్ర గాయాల‌య్యాయి. అధికారులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని క్ష‌త‌గాత్రుల‌ను ద‌గ్గ‌ర్లోని హాస్పిట‌ల్స్‌కు త‌ర‌లిస్తున్నారు. రైలు ఆగివున్న స్టేష‌న‌రీ ప్యాసెంజ‌ర్ రైలును ఢీకొన‌డంతో ఈ ప్ర‌మాదం చోటుచేసుకున్న‌ట్లు తెలుస్తోంది. పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది. (ap train accident)