JD Lakshmi Narayana: స్వ‌రం మార్చిన‌ట్లున్నారు..!?

ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై.. (jagan mohan reddy) జేడీ ల‌క్ష్మీనారాయణ (jd lakshmi narayana) స్వ‌రం మారిన‌ట్లు తెలుస్తోంది. జ‌గ‌న్ సీఎం కాక‌ముందు ఆయ‌న‌సై ఉన్న అక్ర‌మ కేసుల‌ను అప్ప‌టి సీబీఐ అధికారిగా ఉన్న ల‌క్ష్మీనారాయ‌ణే విచార‌ణ చేసారు. జ‌గ‌న్ అంటే ల‌క్ష్మీనారాయ‌ణ‌కు గిట్టేది కాదు. కానీ ఇప్పుడు జ‌గన్ విష‌యంలో ల‌క్ష్మీనారాయ‌ణ అభిప్రాయం మారిన‌ట్లు క‌నిపిస్తోంది. ఇందుకు కార‌ణం ఆయ‌న ఓ సంద‌ర్భంలో అన్న మాట‌లే.

విద్య, వైద్య రంగాల్లో మంచి చేసిన వారికే ఎప్పుడైనా సానుకూలంగా ఫలితాలు ఉంటాయని జగన్ చేసిన నాడు నేడు పథకాలు చాలా బాగున్నాయని తాను చదువుకున్న స్కూల్‌ కూడా ఇప్పుడు చాలా మారి అభివృద్ధి కనిపిస్తోంద‌ని అన్నారు. జ‌గ‌న్ గురించి ల‌క్ష్మీనారాయ‌ణ ఇంత పాజిటివ్‌గా ఎప్పుడూ మాట్లాడింది లేదు. 2024 ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో మ‌ళ్లీ సీఎంగా జ‌గ‌నే గెలుస్తారు అని ఆయ‌న ఇన్‌డైరెక్ట్‌గా అన్న‌ట్లు తెలుస్తోంది.