Rajagopal Reddy: గజ్వేల్‌లో KCR మీద పోటీ చేసి రిటర్న్ గిఫ్ట్ ఇస్తా

Telangana Elections: గజ్వేల్‌లో KCR మీద పోటీ చేసి రిటర్న్ గిఫ్ట్ ఇస్తా అని అన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (rajagopal reddy). మొన్న‌టివ‌ర‌కు BJPలో ఉన్న ఆయ‌న మునుగోడు (munugode) టికెట్ ఇవ్వ‌నందుకు పార్టీకి రాజీనామా చేసి మ‌ళ్లీ సొంత‌గూటికి (congress) వెళ్లిపోయారు. ఈ నేప‌థ్యంలో రాజ‌గోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. తాను రాజీనామా చేసినందుకే మునుగోడుకి నిధులు వచ్చాయని త‌న‌ త్యాగం ఊరికె పోలేదని అన్నారు. రానున్న ఎన్నిక‌ల్లో మునుగోడు నుంచే పోటీ చేస్తాన‌ని అధిష్టానం ఆదేశిస్తే గజ్వేల్‌ (gajwel)  నుండి KCRపై పోటీ చేస్తాన‌ని తెలిపారు.