Telangana Elections: మహేశ్వరం నియోజకవర్గంపై ఢిల్లీలో చర్చ

Telangana Elections: మహేశ్వరంలో (maheshwaram) కాంగ్రెస్ అధిష్టానం (congress) కొత్త వ్యూహం ర‌చిస్తోంది. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో BRS పార్టీ నుంచి మంత్రి సబితా ఇంద్రారెడ్డితో (sabitha indra reddy) బ‌రిలో దిగ‌నున్నారు. కాంగ్రెస్ నుంచి ప్రస్తుతం స్థానికంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు సరిపోరని అధిష్టానం భావిస్తోంది. బయట నుంచి ఒక పెద్ద నాయకుడు (కిచ్చనగారి లాక్ష్మా రెడ్డి)ని తీసుకురావాలన్న‌ ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ల‌క్ష్మా రెడ్డిని ఒప్పించే పనిలో ఉన్న కాంగ్రెస్ అధిష్టానం ఉంది. దీనిపై ఈరోజు స్పష్టత వ‌చ్చే అవ‌కాశం ఉంది.