Rajagopal Reddy: కాంగ్రెస్ నుంచి మునుగోడులో పోటీ..?

Telangana Elections: తెలంగాణ ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డుతున్న సమ‌యంలో BJPకి బిగ్ షాక్ త‌గిలింది. కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి (rajagopal reddy) BJPకి గుడ్‌బై చెప్పి మ‌ళ్లీ సొంత గూటికి చేర‌నున్న‌ట్లు తెలుస్తోంది. నిన్న BJP తెలంగాణ తొలి అభ్య‌ర్ధుల జాబితాను రిలీజ్ చేసింది. అయితే ఆ జాబితాలో రాజ‌గోపాల్ రెడ్డి పేరు లేక‌పోవ‌డంతో ఆయ‌న అలిగిన‌ట్లు సమాచారం. దాంతో మ‌ళ్లీ కాంగ్రెస్‌లో చేరి మునుగోడు నుంచి పోటీ చేయాల‌ని అనుకుంటున్నార‌ట‌. రేపు రాహుల్ గాంధీని (rahul gandhi) క‌లిసి ఇదే విష‌యం గురించి చ‌ర్చించేందుకు రాజ‌గోపాల్ రెడ్డి ఢిల్లీ వెళ్ల‌నున్న‌ట్లు తెలుస్తోంది.