YSRCP: ఈ నెల 26 నుంచి సామాజిక న్యాయ‌ బ‌స్సు యాత్ర‌

ఆంధ‌ప్ర‌దేశ్ ఎన్నిక‌లు (ap elections) ద‌గ్గ‌ర‌ప‌డుతున్న స‌మ‌యంలో  అధికార YSRCP ప్ర‌భుత్వం సామాజిక న్యాయ బ‌స్సు యాత్ర (samajika nyaya bus yatra) చేప‌ట్ట‌నుంది. సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి (jagan mohan reddy) ఈ నెల 26 నుంచి మొద‌టి దశ యాత్ర‌ను చేప‌ట్ట‌నున్నారు. మొద‌టి ద‌శ యాత్ర న‌వంబ‌ర్ 9 వ‌ర‌కు జ‌ర‌గ‌నుంది. ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గంలోని గ‌డ‌ప గ‌డ‌ప‌కూ వెళ్లి తాము చేసిన మంచి ప‌నులు, ప‌థ‌కాలు, అభివృద్ధి గురించి జ‌గ‌న్ ప్ర‌జ‌ల‌కు స్వ‌యంగా తెలియ‌జేస్తార‌ని YSRCP నేత‌లు వెల్ల‌డించారు.