ర‌జ‌నీకాంత్ కుమార్తె ఇంట్లో భారీ దొంగ‌త‌నం

సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ కుమార్తె, ద‌ర్శ‌కురాలు ఐశ్వ‌ర్య ర‌జనీకాంత్ ఇంట్లో దొంగ‌త‌నం చోటుచేసుకుంది. ఈ ఘ‌ట‌న ఫిబ్ర‌వ‌రి నెల‌లో జ‌రిగిన‌ప్ప‌టికీ.. ఆమె ఇటీవ‌ల పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. 3.64 ల‌క్ష‌ల విలువైన 60 స‌వ‌ర్ల‌ బంగారు ఆభ‌ర‌ణాలు, బ్రేస్లెట్లు, వ‌జ్రాభ‌ర‌ణాలు, గోల్డ్ కాయిన్లు అప‌హ‌ర‌ణ‌కు గురైన‌ట్లు ఐశ్వ‌ర్య ఫిర్యాదులో పేర్కొన్నారు. కేవ‌లం బంగారం విలువ 3.64 ల‌క్ష‌లు ఉంటుంద‌ని, అన్నిటిని క‌లిపితే అంత‌కంటే ఎక్కువే ఉంటుంద‌ని తెలిపారు. 2019లో త‌న సోద‌రి సౌంద‌ర్య వివాహ వేడుక‌లో ఆ న‌గ‌లు వేసుకున్నాన‌ని, ఆ త‌ర్వాత భ‌ద్రంగా లాక‌ర్‌లో పెట్టాన‌ని తెలిపారు. ఆ లాక‌ర్‌ను భ‌ర్త ధ‌నుష్‌లో పెట్టార‌ట‌. ఆ త‌ర్వాత దానిని చెన్నైలోని త‌న ఇంటికి తెచ్చుకున్నాన‌ని అప్ప‌టి నుంచి తాను ఆ లాక‌ర్‌ను తెర‌వలేద‌ని పేర్కొన్నారు. ఫిబ్ర‌వ‌రిలో లాక‌ర్ ఓపెన్ చేసి చూడ‌గా ఆభ‌ర‌ణాలు క‌నిపించ‌క‌పోవ‌డంతో ఫిర్యాదు చేస్తున్న‌ట్లు తెలిపారు. త‌న ఇంట్లో ప‌నిచేస్తున్న ముగ్గురు ప‌నివాళ్ల‌పై త‌న‌కు అనుమానం ఉన్న‌ట్లు పోలీసులకు తెలిపారు.