Jagan: డిసెంబర్‌లోగా మ‌కాం వైజాగ్‌కి

డిసెంబ‌ర్‌లోగా మ‌కాం వైజాగ్‌కు (vizag) మార్చ‌నున్న‌ట్లు ఏపీ సీఎం జగ‌న్ (jagan) వెల్ల‌డించారు. రుషికొండ‌లోని ఐటీ సెంట‌ర్‌లో ఇన్ఫోసిస్ డెవ‌ల‌ప్‌మెంట్ సెంట‌ర్‌ను ఈరోజు జ‌గ‌న్ ప్రారంభించారు. ఇన్ఫోసిస్, TCS, విప్రో వంటి కంపెనీలే న‌గ‌రాన్ని మార్చేస్తాయ‌ని.. ఇప్పుడు వైజాగ్‌లో ఇన్ఫోసిస్ వ‌చ్చిన‌ట్లుగానే త్వ‌ర‌లో మిగ‌తా కంపెనీలు కూడా వ‌స్తాయ‌ని ఆశిస్తున్న‌ట్లు తెలిపారు. అన్ని రంగాల్లో వైజాగ్ వృద్ధి చెందుతోంద‌ని ఇప్ప‌టికే విశాఖ ఎడ్యుకేష‌న్ హ‌బ్‌గా మారింద‌ని త్వ‌ర‌లో ఐటీ హ‌బ్‌గానూ మారుతుంద‌ని తెలిపారు.