KCR: ఆలోచించి ఓటేస్తే గెలిచేది ప్ర‌జ‌లే

తెలంగాణ ఎన్నిక‌లు (telangana elections) ద‌గ్గ‌ర‌ప‌డుతున్న నేప‌థ్యంలో సీఎం KCR తొలి ప్రచార స‌భను హుస్నాబాద్‌లో ఏర్పాటుచేసారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. ఓటు ప్ర‌జ‌ల త‌ల‌రాత‌ను మారుస్త‌ద‌ని.. ఆలోచించి ఓటు వేస్తే గెలిచేది ఆ పార్టీ నేత కాదు ప్ర‌జ‌లే అని తెలిపారు. ఇప్పుడు ఎన్నిక‌లు వ‌స్తున్న నేపథ్యంలో ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని కొన్ని పార్టీలు అడుక్కుంటున్నాయ‌ని.. 60 ఏళ్ల కాలంలో 10 ఛాన్సులు ఇచ్చిన‌ప్ప‌టికీ వారు చేసింది ఏమీ లేద‌ని సెటైర్లు వేసారు.