పెళ్లి ఫొటోలు డిలీట్ చేసిన నిహారిక భ‌ర్త‌

సినీ న‌టుడు నాగబాబు కుమార్తె నిహారిక‌.. ఆమె భ‌ర్త చైత‌న్యల మ‌ధ్య అనుబంధం స‌వ్యంగా లేద‌ని టాలీవుడ్ వ‌ర్గాల సమాచారం. ఇన్‌స్టాగ్రామ్‌లో నిహారిక‌, చైత‌న్య‌లు ఒకరినొక‌రు అన్‌ఫాలో చేసుకున్నారు. అంతేకాదు..చైత‌న్య త‌మ పెళ్లి నాటి ఫొటోల‌ను కూడా డిలీట్ చేసేసాడు. ఇక నిహారిక ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీస్‌లో మాత్ర‌మే పెళ్లికి సంబంధించిన ఫొటోలు ఉన్నాయి. చైత‌న్య ఇన్‌స్టాలో నిహారిక కుక్క‌తో ఉన్న ఫొటో త‌ప్ప అన్నీ డిలీట్ చేసేసారు. దాంతో వీరు విడాకులు తీసుకుంటున్నారేమో అన్న సందేహాలు మొద‌ల‌వుతున్నాయి. ఎందుకంటే.. ఈమ‌ధ్య‌కాలంలో సెల‌బ్రిటీలు విడాకులు తీసుకోవ‌డానికి ముందు సోష‌ల్ మీడియాలో ఒక‌రినొకరు అన్‌ఫాలో చేసుకోవ‌డాలు, పెళ్లినాటి ఫొటోలు డిలీట్ చేయ‌డాలు వంటివి చేస్తున్నారు.

గ‌తంలోనూ వీరి గురించి ఇలాంటి పుకార్లే వ‌చ్చాయి. త‌మ నివాసంలో చైతన్య‌, నిహారిక అరుచుకున్నార‌ని పోలీసులు కూడా వ‌చ్చార‌ని అన్నారు. ఆ త‌ర్వాత అంతా మామూలు అయిపోయింది. మ‌ళ్లీ ఇప్పుడు ఒక‌రినొక‌రు అన్‌ఫాలో చేసుకుని ఫొటోలు డిలీట్ చేసేంత‌లా ఏం జ‌రిగిందో వారే చెప్పాలి. 2020లో ఉద‌య్‌పూర్‌లో ఘ‌నంగా నిహారిక‌, చైతన్య జొన్న‌లగ‌డ్డ‌ల వివాహం జ‌రిగింది. పెళ్లి త‌ర్వాత నిహారిక సినిమాలు మానేసి ఓటీటీ కంటెంట్‌ను ప్రొడ్యూస్ చేస్తోంది.