Israel Army: నింగి నేల‌ నీరు ద్వారా గాజాపై దాడులు చేస్తాం

పాలెస్తీనాలోని గాజాపై యుద్ధం చేసేందుకు ఇజ్రాయెల్ (israel army) అన్ని విధాలుగా సిద్ధంగా ఉంది. ఈ నేప‌థ్యంలో అక్క‌డున్న పాలెస్తీనా వాసుల‌ను వెంట‌నే న‌గ‌రాన్ని ఖాళీ చేసి వెళ్లిపోవాల‌ని అల్టిమేటం విధించింది. నింగి నేల నీరు.. ఈ మూడిటి ద్వారా గాజాపై యుద్ధం చేసేందుకు సిద్ధంగా ఉన్న‌ట్లు ఇజ్రాయెల్ వెల్ల‌డించింది. మ‌రోప‌క్క ఇజ్రాయెల్ ప్ర‌ధాని బెంజ‌మిన్ నేత‌న్యాహు (benjamin netanyahu) హ‌మాస్ సంస్థ‌ను హెచ్చ‌రిస్తూ ఓ వీడియో విడుద‌ల చేసారు. జ‌ర‌గ‌బోయేదానికి మీరు సిద్ధంగా ఉన్నారా? అంటూ వీడియోలో పేర్కొన్నారు. ఇప్ప‌టికే హ‌మాస్ చెర‌లో 150 మంది బందీలు ఉన్నారు. ఇప్పుడు ఇజ్రాయెల్ యుద్ధానికి సిద్ధం అవుతున్న నేప‌థ్యంలో వారి ర‌క్ష‌ణ‌పై సందేహాలు వ్య‌క్తం అవుతున్నాయి.