Prudhvi Raj: అధికారం మీదే అన్నా అంటున్నారు

30 ఇయ‌ర్స్ పృథ్వీ రాజ్ (prudhvi raj) గ‌తంలో YSRCP పార్టీలో ఉన్న‌ప్ప‌టికీ అక్క‌డ కొన్ని సంఘ‌ట‌న‌ల వ‌ల్ల అవ‌మానాలు ఎదుర్కొని ఆ పార్టీ నుంచి బ‌య‌టికి వ‌చ్చేసిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు ఆయ‌న పూర్తి మ‌ద్ద‌తు జ‌న‌సేన (janasena) పార్టీకే ఇస్తున్నారు. ప‌వ‌న్ (pawan kalyan) నుంచి అధికారికంగా ఒక్క మాట వ‌స్తే మూడు నియోజ‌క‌వ‌ర్గాల్లో పోటీ చేయ‌డానికి సిద్ధంగా ఉన్నాన‌ని అంటున్నారు.

అయితే ఓ ఇంట‌ర్వ్యూలో పృథ్వీ మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ అంశం ఒక‌టి చెప్పారు. తాను ఇప్పుడు YSRCP పార్టీలో లేక‌పోయిన‌ప్ప‌టికీ త‌న‌కు ఇంకా అందులో స్నేహితులు ఉన్నార‌ని వారు అప్పుడ‌ప్పుడు ఫోన్లు చేసి అన్నా ఇక మా ప‌ని అయిపోయింది. త‌ర్వాత అధికారంలోకి వ‌చ్చేది మీరే అంటుంటార‌ని తెలిపారు. YSRCP మంత్రి రోజాపై  (roja) బండారు స‌త్య‌నారాయ‌ణ‌మూర్తి (bandaru satyanarayana murthy) చేసిన వ్యాఖ్య‌ల గురించి మాట్లాడుతూ.. రోజాను ఆయ‌న అన‌డం ఎంత త‌ప్పో రోజా ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను అత‌ని మాజీ భార్య రేణూ దేశాయ్‌ను అన‌డం కూడా అంతే త‌ప్ప‌ని ఈరోజు త‌న దాకా రావ‌డంతో మీడియా ముందుకు వ‌చ్చి ఏడుస్తోంద‌ని తెలిపారు.