Revanth Reddy: పోయే వ‌య‌సులో పార్టీ మార‌డానికి సిగ్గుండాలి

కాంగ్రెస్ (congress) పార్టీకి రాజీనామా చేసిన సీనియ‌ర్ నేత పొన్నాల ల‌క్ష్మయ్య‌పై TPCC అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి (revanth reddy) షాకింగ్ వ్యాఖ్య‌లు చేసారు. పోయే వ‌య‌సులో పార్టీ మార‌డానికి సిగ్గుండాలి అంటూ ఘాటు వ్యాఖ్య‌లు చేసారు. తెలంగాణ ఎన్నిక‌లు (telangana elections) ద‌గ్గ‌ర‌ప‌డుతున్న త‌రుణంలో సీనియ‌ర్ నేత పార్టీని వీడిపోయినందుకు రేవంత్ అక్క‌సు వెళ‌గ‌క్కుతున్నారు.

జ‌న‌గామ టికెట్ త‌న‌కు ఇవ్వ‌క‌పోవ‌డంతోనే రాజీనామా చేస్తున్న‌ట్లు వార్తలు వ‌చ్చాయి. మ‌రోపక్క పొన్నాల సొంత పార్టీ నేత‌లే అవ‌మానాల‌కు గురిచేస్తుంటే ఈ వ‌య‌సులో త‌ట్టుకోవ‌డం త‌న వ‌ల్ల కాదు అని అంటున్నారు. మ‌రోప‌క్క తెలంగాణ ఐటీ శాఖ మంత్రి KTR పొన్నాల BRS పార్టీలో చేర‌తానంటే ఆయ‌న ఇంటికి వెళ్లి మ‌రీ ఆహ్వానిస్తాన‌ని అంటున్నారు. ఇదే విష‌యం గురించి మీడియా వ‌ర్గాలు పొన్నాల‌ను ప్ర‌శ్నించ‌గా.. అలా ఎలా BRSలో చేరుతున్నాన‌ని మీకు మీరే అనేసుకుంటారు అని మండిప‌డ్డారు.