Chandira Priyanga: పుదుచ్చేరి ఏకైక మ‌హిళా నేత రాజీనామా

పుదుచ్చేరిలో (puducherry) ఏకైక మ‌హిళా నేత అయిన చందీరా ప్రియాంగ (chandira priyanga) రాజీనామా చేసారు. త‌న‌ను ఎలాగైనా ఓడించాల‌ని త‌న ప‌రువు తీయాల‌ని సొంత పార్టీ నేత‌లే కుట్ర ప‌న్న‌డం తట్టుకోలేక రాజీనామా చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. AINRC-BJP పార్టీకి చెందిన ప్రియాంగ‌.. లింగ‌, కుల వివ‌క్ష కారణంగా పార్టీకి రాజీనామా చేస్తున్నాన‌ని వెల్ల‌డించారు.

దాదాపు 40 ఏళ్ల త‌ర్వాత నెండుకాడు ప్రాంతంలో 2021లో ప్రియాంగ‌ను ఎమ్మెల్యేను చేసారు. తాను ద‌ళిత మ‌హిళ‌న‌ని గ‌ర్వంగా చెప్పుకుంటూ ఉండేదాన్న‌ని.. కానీ ఇదే కులాన్ని త‌న‌కు వ్య‌తిరేకంగా వాడి అవ‌మానిస్తార‌ని అనుకోలేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేసారు. ఓ మ‌హిళ ఎంత చ‌దువుకున్నా ఎన్ని తెలివితేట‌లు ఉన్నా ఈ పురుషాధిప‌త్య స‌మాజం మహిళ‌కు ఇవ్వాల్సిన గౌర‌వం ఇవ్వ‌ద‌ని మండిప‌డ్డారు. త‌న రాజీనామా లేఖ‌లో త‌న స్థానంలో ద‌ళిత వ్య‌క్తినే ఎన్నుకోవాల‌ని పుదుచ్చేరి ముఖ్య‌మంత్రి రంగ‌స్వామిని కోరారు