KTR: అబద్ధాల‌ అమిత్ షా పార్టీకి తెలంగాణలో గుణపాఠం తప్పదు

అమిత్ షాకి (amit shah) తెలంగాణ ప్ర‌జ‌లు త‌ప్ప‌కుండా గుణ‌పాఠం చెప్తార‌ని అన్నారు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి KTR. తెలంగాణ ఎన్నిక‌లు (telangana elections) ద‌గ్గ‌ర‌ప‌డుతున్న నేప‌థ్యంలో కేంద్ర మంత్రి అమిత్ షా ఈరోజు ఆదిలాబాద్‌లో ప్ర‌సంగించారు. గిరిజ‌నుల‌కు విశ్వవిద్యాల‌యం ఏర్పాటుచేస్తామంటే రాష్ట్ర ప్ర‌భుత్వం భూములు ఇవ్వ‌లేద‌ని ప‌చ్చి అబ‌ద్ధాలు ఆడుతున్నార‌ని అన్నారు. ఈరోజు ఇలాంటి మంత్రులు కేంద్రంలో ఉండ‌టం అది ప్ర‌జ‌ల దుర‌దృష్టం అని అన్నారు. అమిత్ షా మాట్లాడితే కుటుంబ పాల‌న అంటుంటార‌ని.. ఆ మాట ఆయ‌న అన‌డం విడ్డూరంగా ఉంద‌ని తెలిపారు. ఆయ‌న కుమారుడు జై షా క్రికెట్ రంగంలో ఎన్ని ప‌రుగులు తీసారని BCCI సెక్ర‌ట‌రీగా ఉన్నార‌ని ప్ర‌శ్నించారు. అమిత్ షా, మోదీ ఎన్ని అబద్ధాలు ఆడినా తెలంగాణలో BJPకి ప్రజల చేతుల్లో తిరస్కారం తప్పదని వెల్ల‌డించారు.