KCR: అక్టోబర్ 15న BRS మానిఫెస్టో

తెలంగాణ ఎన్నిక‌లు (telangana elections) న‌వంబ‌ర్ 30న జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో సీఎం KCR త్వ‌ర‌లో మానిఫెస్టో ప్రకటించనున్నారు. అక్టోబర్ 15వ తేదీన BRS పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులతో, తెలంగాణ భవన్‌లో KCR సమావేశం కానున్నారు. అదే రోజు అభ్యర్థులకు బీ ఫామ్‌లు అందించి పార్టీ మేనిఫెస్టో విడుదల చేస్తారు. నవంబర్ 9న కామారెడ్డి, గ‌జ్వేల్ నియోజ‌క‌వ‌ర్గాలకు గానూ నామినేషన్ వేస్తారు. అక్టోబర్ 15, 16, 17, 18 తేదీల్లో జిల్లాలు, నియోజకవర్గాల్లో పర్య‌టిస్తారు.

అక్టోబర్ 15న హైదరాబాద్ నుంచి బయలుదేరి.. హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సాయంత్రం 4 గంటలకు పాల్గొంటారు. అక్టోబర్ 16 నాడు జనగామ, భువనగిరి నియోజకవర్గాల్లో 17న సిద్దిపేట, సిరిసిల్ల నియోజకవర్గ కేంద్రాల్లో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. అక్టోబర్ 18 నాడు.. మధ్యాహ్నం 2 గంటలకు జడ్చర్ల నియోజకవర్గ కేంద్రంలో.. అదే రోజు సాయంత్రం 4 గంటలకు మేడ్చల్ నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించే బహిరంగ సభల్లో పాల్గొంటారు.