Nithya Menon: నేను వేధింపుల‌కు గుర‌య్యాన‌ని ఎవ‌రు చెప్పారు?

నేను వేధింపులకు గుర‌య్యాన‌ని ఎవ‌రు చెప్పారు అంటూ మండిప‌డ్డారు నిత్యా మేన‌న్ (nithya menon) . ఇటీవ‌ల నిత్య ఓ ఇంగ్లీష్ వెబ్‌సైట్‌కు ఇంట‌ర్వ్యూ ఇచ్చారు. అయితే వ్యూస్ కోసం ఇంట‌ర్వ్యూలో నిత్యా చెప్పిన విష‌యాల‌ను మార్చి రాసారు. షూటింగ్ స‌మ‌యంలో ఓ త‌మిళ న‌టుడు త‌న‌ను వేధించాడ‌ని దాని వ‌ల్ల ఎంతో బాధ‌ప‌డ్డాన‌ని నిత్య చెప్పిన‌ట్లు రాసారు. దీనిపై నిత్య స్పందించారు. ఇలా త‌నే స్వ‌యంగా వెల్ల‌డించిన‌ట్లు రాస్తే జ‌నాలు నిజం అనుకునే ప్ర‌మాదం ఉంద‌ని అందుకే స్పందించాల‌ని అనుకుంటున్నాన‌ని అన్నారు. అస‌లు ఈ విష‌యం గురించి తాను ఎక్క‌డా మాట్లాడ‌న‌ప్పుడు అలా ఎలా రాసేస్తార‌ని మండిప‌డ్డారు.

ఇక నిత్య మేన‌న్ న‌టించిన శ్రీమ‌తి కుమారి (srimathi kumari) అనే వెబ్ సిరీస్‌కు మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తోంది. ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైంలో రిలీజ్ అయింది. దీంతో పాటు నిత్యా మేన‌న్.. ధ‌నుష్ న‌టించిన తిరుచిత్రాంబ‌ళం (thiru chitrambalam) సినిమా ఇప్పుడు ప్రైంలో అన్ని భాష‌ల్లో అందుబాటులో ఉంది.

NewsX Telugu ఇప్పుడు వాట్సాప్ చానెల్‌లో.. తాజా అప్డేట్స్ కోసం లింక్ క్లిక్ చేసి ఫాలో అవ్వండి

https://whatsapp.com/channel/0029Va6hexVLY6d61aa0TL3c