Kangana: మారండి.. లేక‌పోతే మార్చాల్సి ఉంటుంది

ఇప్ప‌టికైనా మారండి.. లేక‌పోతే మార్చాల్సి ఉంటుంది అని వార్నింగ్ ఇచ్చారు న‌టి కంగనా ర‌నౌత్ (kangana). ఇంత‌కీ ఈ వార్నింగ్ ఎవ‌రికి అనుకుంటున్నారా? మ‌హ‌దేవ్ బెట్టింగ్ యాప్‌కి (mahadev app) ప్ర‌చార‌క‌ర్త‌లుగా వ్య‌వ‌హరించి కోట్ల రూపాయ‌లు పారితోషికం తీసుకున్న బాలీవుడ్ సెల‌బ్రిటీల‌కు కంగన ఈ వార్నింగ్ ఇచ్చారు. మ‌హ‌దేవ్ బెట్టింగ్ యాప్ పేరుతో రోజూ రూ.200 కోట్ల వ‌ర‌కు ప్ర‌జ‌ల‌ను దోచుకున్న ఈ సంస్థ‌కు బాలీవుడ్ న‌టుడు ర‌ణ్‌బీర్ క‌పూర్‌, హుమా ఖురేషీ, శ్ర‌ద్ధా క‌పూర్, సోనాక్షి సిన్హా, టైగ‌ర్ ష్రాఫ్‌లు ప్ర‌చార‌క‌ర్త‌లుగా వ్య‌వ‌హ‌రించారు. దీనికి వారు కొన్ని కోట్ల రూపాయ‌ల‌ను పారితోషికంగా తీసుకున్నారు. ఈ కేసులో భాగంగా ఇప్ప‌టికే ఈడీ ర‌ణ్‌బీర్ క‌పూర్‌కు నోటీసులు జారీ చేసింది. ఈ హ‌వాలా యాప్‌కు ప్ర‌చార‌క‌ర్త‌లుగా వ్య‌వ‌హ‌రించిన వారిలో ప‌లువురు టాలీవుడ్ సెల‌బ్రిటీలు కూడా ఉన్నారని పోలీసులు తెలిపారు. త్వ‌ర‌లో వారికి కూడా నోటీసులు ఇస్తామ‌ని వెల్ల‌డించారు.

దీనిపై కంగ‌న స్పందిస్తూ.. “” ఈ యాప్‌కు ప్ర‌చార‌క‌ర్త‌గా ఉండాల‌ని ఒకే ఏడాదిలో ఆరు సార్లు నాకు ఆఫ‌ర్ ఇచ్చారు. ప్ర‌తిసారీ కోట్లు కోట్లు పెంచుతూ ఉండేవారు. అయినా కూడా నేను ఒప్పుకోలేదు. ఇది న‌యా భార‌త్. ఇంకా ఈ మోసాల‌కు పాల్ప‌డ‌లేరు. ఇప్ప‌టికైనా ఇలాంటి యాప్స్‌కి ప్ర‌చార‌కర్త‌లుగా వ్య‌వ‌హ‌రిస్తున్న సెల‌బ్రిటీలు మారండి. లేక‌పోతే మార్చాల్సి ఉంటుంది “” అని వెల్ల‌డించారు. (kangana ranaut)