Sikkim: వ‌ర‌ద‌ల్లో కొట్టుకుపోయిన 23 మంది సైనికులు

సిక్కింను (sikkim) వ‌ర‌ద‌లు ముంచెత్తుతున్నాయి. భారీ వ‌ర్షాల కార‌ణంగా స్థానిక తీస్తా న‌ది పొంగి పొర్లింది. ఈ వ‌ర‌ద‌ల్లో దాదాపు 23 మంది సైనికులు గ‌ల్లంత‌య్యారు. చుంగ్‌థాంగ్ డ్యాం నుంచి నీరు విడుద‌ల కావ‌డంతో నీటి స్థాయి15 నుంచి 20 అడుగుల‌కు పెరిగింది. దాంతో సింగ్తామ్ ప్రాంతంలోని బార్దాంగ్ వ‌ద్ద పార్క్ చేసిన ఉన్న ఆర్మీ వాహ‌నాల‌తో స‌హా సిబ్బంది కూడా గల్లంత‌య్యారు. నిన్న రాత్రి నుంచి సిక్కంలో ఎడ‌తెరిపి లేకుండా వ‌ర్షం ప‌డుతోంది. ప్ర‌స్తుతం అధికారులు గల్లంతైన ఆర్మీ సిబ్బంది కోసం గాలిస్తున్నారు.