Nanded Hospital డీన్ చేత బాత్రూమ్ క‌డిగించిన మంత్రి

రెండు రోజుల వ్య‌వ‌ధిలోనే 31 మంది పేషెంట్లు మృత్యువాత‌ప‌డిన నాందేడ్ ప్ర‌భుత్వ హాస్పిట‌ల్‌ను (nanded hospital) సంద‌ర్శించారు శివ‌సేన (shiv sena) పార్టీకి చెందిన నేత హేమంత్ పాటిల్. హాస్పిట‌ల్‌లో మందుల కొర‌త కానీ వైద్యులు, న‌ర్సుల కొర‌త కానీ లేద‌ని.. వారి ఆరోగ్యం విష‌మించ‌డంతోనే చ‌నిపోయార‌ని హాస్పిట‌ల్ డీన్ శ్యాంరావు వ‌కోడే మీడియా ద్వారా తెలిపారు. మంత్రి హేమంత్ పాటిల్ హాస్పిట‌ల్‌ను సంద‌ర్శించ‌డానికి వెళ్ల‌గా.. అక్క‌డి బాత్రూమ్‌లు అష్ట‌ద‌రిద్రంగా ఉండ‌టం చూసి త‌లా తోకా లేని స‌మాధానాలు చెప్తున్న డీన్‌ వ‌కోడే చేతే ఆ బాత్రూమ్‌ను క‌డిగించారు.