Nara Lokesh: ఢిల్లీకి AP CID .. నేరుగా నోటీసులు

AP CID అధికారులు ఈరోజు ఢిల్లీ బ‌య‌లుదేరారు. గ‌త 16 రోజులుగా నారా లోకేష్ (nara lokesh) ఢిల్లీలోనే ఉంటున్నారు. అమ‌రావ‌తి ఇన్న‌ర్ రింగ్ రోడ్డు కేసులో AOP CID లోకేష్ పేరును చేర్చింది. CRPC 41A సెక్ష‌న్ కింద ఆయ‌న‌కు నేరుగా నోటీసులు ఇచ్చేందుకు  AP CID ఢిల్లీ చేరుకుంది. ఈ కేసులో లోకేష్ పెట్టుకున్న ముంద‌స్తు బెయిల్‌కు కోర్టు అంగీక‌రించింది. అయితే AP CID త‌ర‌ఫు న్యాయ‌వాది కోర్టులో త‌న వాద‌న‌లు వినిపిస్తూ.. లోకేష్‌ను అరెస్ట్ చేయ‌బోం అని.. కేవ‌లం విచారించేందుకు మాత్ర‌మే నోటీసులు ఇవ్వ‌నున్నామ‌ని తెలిపారు.