మ‌హేశ్వ‌రం టికెట్ కోసం రేవంత్ రూ.10 కోట్లు తీసుకున్నాడు

కాంగ్రెస్ (congress) పార్టీ టిక్కెట్లను రేవంత్ రెడ్డి (revanth reddy) అమ్ముకుంటున్నాడని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసారు కాంగ్రెస్ నేత కొత్త మనోహర్ రెడ్డి (kotha manohar reddy). మహేశ్వరం కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం రేవంత్ రెడ్డి బడంగ్‌పేట మేయర్ చిగురింత పారిజాత నర్సింహా రెడ్డి వద్ద 10 కోట్లు తీసుకొని 5 ఎకరాల భూమి రాయించుకున్నాడని సంచ‌ల‌న‌ ఆరోప‌ణ‌లు చేసారు. సమయం వచ్చినపుడు అన్ని సాక్ష్యాలతో సహా బైట పెడతాన‌ని అన్నారు. ఈ విషయం సీనియర్ నాయకుడు వీ. హనుమంత రావు సైతం చెప్పారని.. సమయం వచ్చినపుడు అన్ని సాక్ష్యాలతో బ‌య‌ట‌ పెడతాన‌ని అన్నారు.