టిక్కెట్లు ఇవ్వనంత మాత్రాన నావాళ్లు కాకుండాపోరు

మనం అంతా ఒక కుటుంబంలో సభ్యులమే అని కొంతమందికి టిక్కెట్లు రావొచ్చు, మరికొంత మందికి ఇవ్వలేకపోవచ్చు అని ఏపీ సీఎం వైఎస్ జగన్ (jagan) అన్నారు. ఎవరికి ఇస్తే కరెక్టు అనే ప్రాతిపదికన నిర్ణయాలు తీసుకోవచ్చని టిక్కెట్టు ఇవ్వనంత మాత్రాన, ఆ వ్యక్తి మన మనిషి కాకుండా పోతారా అని తెలిపారు. టిక్కెట్లు ఇవ్వనంత మాత్రాన త‌న వాళ్లు కాకుండాపోరని టిక్కెట్లు ఇచ్చే విషయంలో ప్రతి ఒక్కరూ త‌న‌ నిర్ణయాలను పెద్ద మనసుతో స్వాగతించాలని రిక్వెస్ట్ చేసారు. టిక్కెట్లు ఇవ్వని పక్షంలో మరొకటి ఇస్తామ‌ని లీడర్‌మీద, పార్టీ మీద నమ్మకం ఉంచాల‌ని జ‌గ‌న్ YSRCP నేత‌ల‌కు వివ‌రించారు.