Mynampally: సోనియాతో ఫోటో దిగాల‌ని ఎప్ప‌టినుంచో కోరిక‌

BRSకు రాజీనామా చేసిన మైనంప‌ల్లి హనుమంత‌రావు.. (mynampally) ఈనెల 27న ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ (congress) పార్టీలో చేరనున్నారు. స్పెషల్ కేసు కింద త‌మ‌కు 2 టిక్కెట్లు ఇస్తాం అని హామీ ఇచ్చారని సోనియా గాంధీ నుంచి ఎంతో స్ఫూర్తి పొందానని తెలిపారు. ఆమెతో ఒక్క ఫోటో దిగాలని ఎప్పటినుండో ఆశ‌గా ఉండేద‌ని పేర్కొన్నారు. త‌న కుమారుడికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వ‌లేద‌ని BRS పార్టీని నోటికొచ్చినట్లు ధూషించిన మైనంప‌ల్లికి తెలంగాణ సీఎం KCR టికెట్ ఇచ్చారు. కానీ త‌న‌కు ఆ టికెట్ వ‌ద్ద‌ని త‌న స్థానంలో తన కుమారుడికి ఇస్తే రోజులో రెండు గంట‌ల పాటు నిద్ర‌పోయి మ‌రీ గెలిపించుకుంటాన‌ని అన్నారు. ఇందుకు KCR ఒప్పుకోక‌పోవ‌డంతో పార్టీ నుంచి త‌ప్పుకున్నారు. (mynampally hanumanth rao)