Chandrababu Naidu: మ‌రో 3 రోజుల పాటు AP CID క‌స్ట‌డీలోనే?

చంద్రబాబు నాయుడు (chandrababu naidu) ప్ర‌స్తుతం AP CID క‌స్ట‌డీలో ఉన్నారు. రెండు రోజుల విచార‌ణ‌తో పాటు ఆయ‌న జ్యుడిషియ‌ల్ రిమాండ్ కూడా ఈరోజుతో ముగియ‌నుంది. ఈ నేప‌థ్యంలో AP CID మరో పిటిష‌న్‌ను దాఖ‌లు చేసింది. ఇంకో మూడు రోజులు CID క‌స్ట‌డీలోనే ఉంచాల‌ని ఆ పిటిష‌న్‌లో కోరింది. ఇంకా చంద్ర‌బాబు నుంచి రావాల్సిన వివ‌రాలు రాలేద‌ని కోర్టుకు తెల‌ప‌నుంది. జ్యుడిషియ‌ల్ రిమాండ్ ముగియ‌నున్న నేప‌థ్యంలో ఈరోజు సాయంత్రం AP ACB కోర్టు న్యాయ‌మూర్తి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చంద్ర‌బాబు నాయుడితో మాట్లాడ‌నున్నారు.