Karnataka: బిడ్డా.. నువ్వా..!

కొడుకు దుబాయ్‌లో సంపాదిస్తుంటే.. ఆ క‌న్న‌త‌ల్లి క‌ర్ణాట‌క‌లో (karnataka) చ‌ప‌లు అమ్ముతూ బ‌తుకుతోంది. దాదాపు మూడేళ్ల త‌ర్వాత కొడుకు తిరిగొచ్చి స‌ర్‌ప్రైజ్ ఇవ్వాల‌నుకున్నాడు. త‌న ముఖం క‌ళ్లు క‌నిపించ‌కుండా క‌ర్ఛీఫ్ క‌ట్టుకుని సాధార‌ణ క‌స్ట‌మ‌ర్‌లాగా చేప‌లు కొన‌డానికి వెళ్లాడు. చేప‌ల కోసం బేరం ఆడాడు. గొంతు, వాల‌కం చూసి కొద్ది క్ష‌ణాల్లోనే త‌న బిడ్డే అని గుర్తుప‌ట్టిన ఆ త‌ల్లి కొడుకుని హ‌త్తుకుని క‌న్నీరుపెట్టుకుంది. ఈ మ‌న‌సుని హ‌త్తుకునే ఘ‌ట‌న క‌ర్ణాట‌క‌లో ఉడిపిలో చోటుచేసుకుంది.