Chandrababu: సుప్రీంకోర్టులో క్వాష్‌ పిటిషన్ వేసిన లాయ‌ర్లు

ఏపీ హైకోర్టు చంద్ర‌బాబు నాయుడుకు (chandrababu) సంబంధించిన క్వాష్ పిటిష‌న్‌ను (quash petition) కొట్టివేసిన నేప‌థ్యంలో ఆయ‌న త‌రఫు లాయ‌ర్లు సుప్రీంకోర్టును (supreme court) ఆశ్ర‌యించారు. ఈరోజు క్వాష్ పిటిష‌న్‌ను సుప్రీంకోర్టులో ఫైల్ చేసారు. చంద్ర‌బాబు నాయుడుపై స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ పేరుతో త‌ప్పుడు కేసు బనాయించార‌ని.. గ‌వ‌ర్న‌ర్ అనుమ‌తి లేకుండా మాజీ సీఎంను అరెస్ట్ చేయ‌డం స‌బ‌బు కాద‌ని కేసు కొట్టేయాల‌ని కోరుతూ చంద్ర‌బాబు త‌ర‌ఫు లాయ‌ర్లు ఏపీ హైకోర్టులో పిటిష‌న్ వేసారు. వాదోపవాదాలు విన్న హైకోర్టు న్యాయ‌మూర్తి.. కేసు విచార‌ణ తుది ద‌శ‌లో ఉన్నందున జోక్యం చేసుకోలేమ‌ని పిటిష‌న్‌ను రిజెక్ట్ చేసింది. ఇప్పుడు సుప్రీంకోర్టులో వేసిన పిటిష‌న్ సోమ‌వారం విచార‌ణ‌కు వ‌చ్చే అవ‌కాశం ఉంది.