Jangaon Ticket ఎవ‌రికో.. బుజ్జ‌గింపులు ఎవ‌రికో..?

జ‌న‌గామ టికెట్‌పై (jangaon ticket) ఎవ‌రు పోటీ చేస్తారు అనే అంశంపై ఈరోజు తెలంగాణ సీఎం KCRతో.. ఐటీ శాఖ మంత్రి KTR చ‌ర్చించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే ఈ టికెట్ కోసం ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డి పోటీ ప‌డుతున్నారు. ఈ నేప‌థ్యంలో KTR వీరిద్ద‌రినీ క‌లిసి స‌యోధ్య‌ను కుద‌ర్చాల‌ని చూస్తున్నారు. దాంతో టికెట్ ఎవ‌రికి ద‌క్క‌నుందా అన్న ఉత్కంఠ నెల‌కొంది. ఇప్ప‌టికే స్టేష‌న్ ఘ‌న్‌పూర్ టికెట్ కోసం హోరా హోరీగా కొట్టుకుంటున్న రాజయ్య‌, క‌డియం శ్రీహ‌రిల మ‌ధ్య స‌యోధ్య‌ను కుదిర్చారు KTR. ఏం చెప్పి బుజ్జ‌గించారో తెలీదు కానీ.. నా స‌పోర్ట్ క‌డియం అన్న‌కే అంటూ రాజ‌య్య ప్ర‌క‌టించ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఎన్నిక‌ల‌కు ముందు పార్టీ నేత‌లు త‌మ‌లో తామే కొట్టుకుంటే ఎక్క‌డ కాంగ్రెస్, BJP వారిని త‌మ పార్టీలోకి లాక్కుంటాయోన‌ని KCR త‌న ప్లాన్‌లో ఉన్నార‌ని క్లియ‌ర్‌గా తెలుస్తోంది. (telangana elections)