Chandrababu: బెయిల్ పిటిషన్లు రేప‌టికి వాయిదా

స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ స్కాంలో (skill development scam) జ్యుడిషియ‌ల్ క‌స్ట‌డీలో ఉన్న TDP అధినేత చంద్ర‌బాబు నాయుడుకు (chandrababu) సంబంధించిన బెయిల్ పిటిష‌న్ల‌ను ఏపీ ఏసీబీ కోర్టు రేప‌టికి వాయిదా వేసింది. సుప్రీంకోర్టు న్యాయ‌వాది సిద్ధార్థ్ లుత్రాల‌తో (siddharth luthra) పాటు భార‌త టాప్ న్యాయ‌వాదుల్లో ఒక‌రైన హ‌రీష్ సాల్వే (harish salve) కూడా ఈ కేసును ఫ్రాన్స్ నుంచే త‌మ వాద‌న‌లు వినిపించారు. వీరిద్ద‌రితో పాటు సిద్ధార్థ్ అగ‌ర్వాల్ అనే మ‌రో లాయ‌ర్ కూడా వాదించారు. ఈరోజు మ‌ధ్యాహ్నం నుంచి ఏసీబీ కోర్టు వాదోప‌వాదాలు విన్నాక బెయిల్ పిటిష‌న్ల‌ను రేప‌టికి వాయిదా వేసింది.