YS Sharmila: KCR ఒక్క స్విచ్ వేస్తేనే పాల‌మూరు ప‌చ్చ‌బ‌డ్డ‌దా?

తెలంగాణ సీఎం KCR ఒక్క స్విచ్ వేస్తేనే పాల‌మూరు ప‌చ్చ‌బ‌డ్డ‌దా అని విమ‌ర్శించారు వైఎస్ ష‌ర్మిళ‌ (ys sharmila). సగం పనులు కూడా పూర్తి కాని ప్రాజెక్టుతో ఎన్నికల రాజకీయం చేస్తున్నార‌ని ఆరోపించారు. ఒక్క మోటార్ స్విచ్ ఆన్ చేసి పాలమూరు పచ్చబడ్డట్లు కాకమ్మ కథలు చెప్తున్నారని ఎనిమిదేళ్లుగా ప్రాజెక్టు పూర్తి చేయడం చేతకాలేదు కానీ దక్షిణ తెలంగాణ మొత్తం సస్యశ్యామలం చేస్తున్నట్లు చెప్పుకోవడానికి సిగ్గుండాలని మండిపడ్డారు. మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో ప్రజా వ్యతిరేకతను కప్పిపుచ్చుకునేందుకే KCR పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును వాడుకుంటున్నారని అన్నారు.