ED: ఈనెల 26 వరకు నోటీసులు ఇవ్వం

ఢిల్లీ లిక్కర్ స్కాం (delhi liquor scam) కేసులో విచారణకు రావాలంటూ ED ఇచ్చిన నోటీసులపై ఎమ్మెల్సీ కవిత (kavitha) సుప్రీంకోర్టును (supreme court) ఆశ్ర‌యించారు. ఈ కేసును విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. తదుపరి విచారణను ఈనెల 26కు వాయిదా వేసింది. దీనిపై వాదనలు వినిపించిన ఈడీ కావాలంటే మరో 10 రోజులు సమయం ఇస్తామని, విచారణకు హాజరు కావాల్సిందేనని స్పష్టంచేసింది. ఈనెల 26 వరకు సమన్లు ఇవ్వబోమని తెలిపింది. దీంతో తదుపరి విచారణలో తుది ఆదేశాలిస్తామని సుప్రీంకోర్టు వెల్ల‌డించింది.