Kanchanbagh: తెల్ల‌వారుజామున న‌రికేసారు..!

హైద‌రాబాద్ న‌గ‌రంలోని కాంచ‌న్‌బాగ్ (kanchanbagh)ప్రాంతంలో బుధ‌వారం ఉద‌యం హ‌త్య జ‌రిగింది. ఈరోజు తెల్ల‌వారుజామున 25 ఏళ్ల యువ‌కుడిని కొంద‌రు వ్య‌క్తులు దాడి చేసి మ‌రీ న‌రికి చంపారు. నిందితుడిని న‌జీర్‌గా పోలీసులు గుర్తించారు. బుధ‌వారం తెల్ల‌వారుజామున 2 గంట‌ల స‌మ‌యంలో హ‌ఫీజ్ బాబా న‌గ‌ర్ కాల‌నీలో న‌జీర్‌పై కొంద‌రు వ్య‌క్తులు ప‌దునైన ఆయుధాల‌తో వెంబ‌డించి మ‌రీ న‌రికి చంపారు. న‌జీర్ ర‌క్త‌పు మ‌డుగుల‌లో ప‌డి ఉండ‌టం చూసి స్థానికులు వెంట‌నే అత‌ని కుటుంబ స‌భ్యుల‌కు స‌మాచారం అందించారు. వెంట‌నే న‌జీర్‌ను ఉస్మానియా హాస్పిట‌ల్‌కు త‌ర‌లించ‌గా తీవ్ర ర‌క్త‌స్రావం కావ‌డంతో అప్ప‌టికే మృతిచెందిన‌ట్లు తెలిపారు. పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.