Bhuvaneshwari: చంద్ర‌బాబుని క‌లిసిన స‌తీమ‌ణి.. ఆమె రియాక్ష‌న్ ఇదే

రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైలులో రిమాండ్‌లో ఉన్న చంద్ర‌బాబు నాయుడిని (chandrababu naidu) ఆయ‌న కుటుంబ స‌భ్యులు ఈరోజు క‌లిసారు. చంద్ర‌బాబు భార్య నారా భువ‌నేశ్వ‌రి, కుమారుడు లోకేష్‌, కోడ‌లు బ్రాహ్మ‌ణి దాదాపు 45 నిమిషాల పాలు ములాఖాత్ అయ్యారు. చంద్ర‌బాబుని క‌లిసాక భువ‌నేశ్వరి మీడియాతో మాట్లాడారు.  ఏపీ బాగు కోసం ప‌నిచేసిన వ్య‌క్తి.. ఏపీ ప్ర‌జ‌ల అభివృద్ధి కోసం ప‌నిచేసిన వ్యక్తి చంద్రబాబు అని అన్నారు భువ‌నేశ్వ‌రి (bhuvaneshwari). “” నేను కుటుంబం గురించి మాట్లాడాలంటే ఆయ‌న ఒకటే అనేవారు. నాకు ముందు ప్ర‌జ‌లు, త‌ర్వాతే కుటుంబం అనేవారు. అలాంటి వ్య‌క్తిని ఆయ‌న నిర్మించిన అదే బిల్డింగ్‌లో అరెస్ట్ చేసి ఉంచారు “” అంటూ ఆమె ఆవేద‌న వ్య‌క్తం చేసారు. ఆయ‌న్ను క‌లిసి వ‌చ్చాక తన శ‌రీరంలోని ఒక భాగం అక్క‌డే వ‌దిలి వ‌చ్చిన‌ట్లు ఉంద‌ని బాధ‌ప‌డ్డారు. ఆయ‌న‌కు ఏ1 భ‌ద్ర‌త క‌ల్పించాల‌ని, కానీ ఈరోజు ఆయ‌న్ను క‌లిసాక ఆ భ‌ద్ర‌త లేద‌ని క్లియర్‌గా తెలుస్తోంద‌ని అన్నారు.