Etela Jamuna: KCR మీద పోటీకి సై

తెలంగాణ సీఎం KCRపై గజ్వేల్‌లో (gajwel) పోటీకి సిద్ధంగా ఉన్న‌ట్లు ఈటెల రాజేంద‌ర్ భార్య ఈటెల జ‌మున (etela jamuna) వెల్ల‌డించారు. గజ్వేల్ BJP టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్న‌ట్లు తెలిపారు. తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో  (telangana assembly elections) ఎమ్మెల్యే అభ్యర్థుల కోసం దరఖాస్తులు ఆహ్వానించగా నిన్నటితో గడువు ముగిసింది. మొత్తం 6,003 దరఖాస్తులు రాగా చివరిరోజు 2,780 దరఖాస్తులు వచ్చాయి. అయితే ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అరవింద్, కిషన్ రెడ్డి, సోయం బాపు రావు, డీకే అరుణ, లక్ష్మణ్ దరఖాస్తు చేసుకోలేదు. మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి మహబూబ్ నగర్ నుండి దరఖాస్తు చేయగా హుజూరాబాద్ నుండి ఈటెల రాజేందర్, గజ్వేల్ నుండి ఆయన సతీమణి ఈటెల జమున దరఖాస్తు చేసుకున్నారు.