Rajinikanth: మారిముత్తు మ‌ర‌ణ‌వార్త విని షాక‌య్యా

జైలర్ (jailer) సినిమాలో పన్నీరు పాత్ర‌లో న‌టించిన త‌మిళ న‌టుడు మారిముత్తు (marimuthu) మ‌ర‌ణ వార్త విని షాకయ్యాన‌ని అన్నారు సూప‌ర్‌స్టార్ ర‌జినీకాంత్ (rajinikanth). ఈరోజు ఉద‌యం త‌మిళ‌నాడులో ఓ డ‌బ్బింగ్ స్టూడియోలో డ‌బ్బింగ్ చెప్తుండ‌గా మారిముత్తు గుండెపోటుతో సొమ్మ‌సిల్లి ప‌డిపోయారు. వెంట‌నే ఆయ‌న్ను ద‌గ్గ‌ర్లోని హాస్పిట‌ల్‌కు త‌ర‌లించినా ఫ‌లితం లేకుండాపోయింది. మారిముత్తు మృతితో త‌మిళ చిత్ర ప‌రిశ్ర‌మలో విషాద‌ఛాయ‌లు అలుముకున్నాయి. మారిముత్తు మృతిప‌ట్ల ర‌జినీ మాట్లాడుతూ.. ఆయ‌న ఎంతో అద్భుత‌మైన వ్య‌క్తి అని.. ఆయ‌న మ‌ర‌ణం షాక్‌కు గురి చేసింద‌ని అన్నారు. మారిముత్తు కుటుంబీకులు ప్ర‌గాఢ సానుభూతి తెలిపారు. (rajinikanth)