Vijay Sai Reddy: పురంధేశ్వరి..ఒక్క క్షణం ఆలోచించమ్మా!

పురంధేశ్వ‌రి.. ఒక్క‌సారి ఆలోచించ‌మ్మా అంటూ YSRCP నేత విజ‌య సాయి రెడ్డి (vijay sai reddy) ట్వీట్ చేసారు. ఎన్టీఆర్‌గారు ప్రేమతో చూసుకున్న అబిడ్స్ ఇల్లు విజయ్ ఎలక్ట్రికల్స్ రమేశ్‌కి కేవలం 4 కోట్లకు అమ్మేసార‌ని ఆ ఇల్లు విష‌యంలో మ‌రోసారి ఆలోచించాల‌ని రిక్వెస్ట్ చేసారు.

“” నంద‌మూరి వారి దగ్గర నాలుగు కోట్లు కూడా లేవా? అది నందమూరి రామకృష్ణగారి వాటాకు వచ్చింది. చంద్రబాబు కానీ పురంధ్రీశ్వరి కానీ ఆ ఇంటిని కొని ఎన్టీఆర్ జ్ఞాపకార్థంగా వుంచవచ్చుగా! ఆయన మీద మీకున్న నిజమైన ప్రేమకు అద్దం పడుతుంది. ఈ వీడియోలోని అయన మద్రాస్ ఇంటి ప్రస్తుత పరిస్థితి“”  అంటూ ఆ ఇంటి వీడియో షేర్ చేసారు.

మ‌రో ట్వీట్‌లో ఈ విధంగా కామెంట్ చేసారు

పురంధేశ్వరి! ఒక్క క్షణం ఆలోచించమ్మా!

*వాటాలు తేల్చుకోలేక మద్రాసులో NTR ఇల్లు పాడు పెట్టేశారు.

*అబిడ్స్‌లో ఉన్న ఆయ‌న ఇంటిని అమ్మేసారు.

* బంజారాహిల్స్ లో ఆయన మరణించిన ఇల్లు పడగొట్టి అపార్ట్మెంట్ లు కట్టుకుని అద్దెకిచ్చారు.

* దానికి ఎదురు ఉన్న అయన ఇంట్లో మ్యూజియం పెట్టాలనుకున్నారు. అయన ఆశయాలకు నీళ్ళుకొట్టారు.

*తండ్రిపై ప్రేమ గుండెలోతుల్లో హృదయ అంతరంగం నుంచి రావాలేకానీ…పేపర్లు, టీవీల్లో కాదు చెల్లెమ్మా!

*సమాధి తప్ప ఆయనకు స్మారకచిహ్నం కూడా లేకుండా చేసి ఇప్పుడు 100 రూపాయల నాణెం అంటారు.

*భారతరత్న గురించి మీరు ఢిల్లీలో ఏనాడు అడగలేదు. రాజకీయ పూర్వాశ్రమంలో మిమ్మల్ని వెన్నుతట్టి ప్రోత్సహించిన అప్పటి మీ నాయకురాలు సోనియాకు మీరు చెప్పిన హృదయపూర్వక కృతఙ్ఞతలు మరచిపోలేమమ్మా! (vijay sai reddy)

ఎన్టీఆర్ ఆశ‌యాలు నెర‌వేర్చ‌కుండా ఇప్పుడు ఆయ‌న బొమ్మ‌తో తయారుచేసిన రూ.100 నాణెంను ప్ర‌వేశ‌పెడితే మాత్రం ఏం లాభం అన్న ఉద్దేశంతో విజ‌య్ సాయి రెడ్డి నంద‌మూరి కుటుంబీకుల‌పై కామెంట్ చేసారు.