Madurai: చాయ్ పెట్టుకుందామ‌నుకుంటే.. ఇలా జ‌రిగింది!

మ‌ధురైలో (madurai) శ‌నివారం తెల్ల‌వారుజామున ఘోర ప్ర‌మాదం చోటుచేసుకుంది. పార్కింగ్‌లో ఉన్న టూరిస్ట్ ట్రైన్‌లో ఉన్న‌ట్టుండి మంట‌లు చెల‌రేగాయి. దాంతో అక్కడే ఉన్న 8 మంది స‌జీవ‌దహ‌నం అయ్యారు. మ‌రో 20 మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. కొంద‌రు ప్యాసెంజ‌ర్లు అక్ర‌మంగా సిలిండ‌ర్‌లో రైలులోకి తీసుకురావ‌డం వ‌ల్ల అది పేలిపోయి ఈ ప్ర‌మాదం జ‌రిగింద‌ని రైల్వే అధికారులు తెలిపారు. గ్యాస్ సిలిండ‌ర్‌ను రైలులోకి ఎక్కించ‌డ‌మే కాకుండా టీ పెట్టుకుందామ‌ని అనుకున్నార‌ట‌. అలా వారు గ్యాస్ వెలిగించ‌డంతో సిలిండ‌ర్ పేలిపోయి ఈ ప్ర‌మాదం చోటుచేసుకుంది. (madurai train accident)