BJP Minister: ఐశ్వ‌ర్య లాంటి క‌ళ్లు కావాలంటే…

మ‌హారాష్ట్రకు చెందిన BJP మంత్రి (bjp minister) బ్యూటీ టిప్స్ ఇస్తున్నారు. ఐశ్వ‌ర్య‌రాయ్ లాంటి క‌ళ్లు కావాలంటే అంద‌రూ చేప‌లు తినాలి అంటూ కామెంట్స్ చేసి ఇరుక్కున్నారు. గిరిజన మంత్రి అయిన విజయ్ కుమార్ గ‌విట్ (vijaykumar gavit) ఈ వ్యాఖ్య‌లు చేసారు. చేప‌లు తిన‌డం వ‌ల్ల మ‌గ‌వాళ్లు ఆడ‌వారిని మైమ‌రపించేవ‌చ్చు అంటూ వాగేసారు. క‌ర్ణాక‌ట‌లోని నందూర్బ‌ర్ జిల్లాలో ఏర్పాటుచేసిన స‌మావేశంలో విజ‌య్ కుమార్ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ..“” మీరు ఐశ్వ‌ర్య రాయ్ క‌ళ్ల‌ను చూసారా? ఎంత అందంగా ఉంటాయో. ఆమె మంగ‌ళూరులోని తీర ప్రాంతంలోనే పెరిగింది. రోజూ చేప‌లు తినేది. అందుకే ఆమె క‌ళ్లు అంత అందంగా ఉన్నాయి. చేప‌లు తిన‌డం వ‌ల్ల రెండు లాభాలు ఉన్నాయి. ఆడ‌వాళ్ల క‌ళ్లు అందంగా త‌యార‌వ్వ‌డ‌మే కాదు.. చ‌ర్మం కూడా ముడ‌తలు లేకుండా బాగుంటుంది “” అని తెలిపారు. (bjp minister)

దాంతో ప్ర‌తిప‌క్ష పార్టీలు గ‌విట్ వ్యాఖ్య‌ల‌పై మండిప‌డ్డారు. ప్ర‌జ‌ల సంర‌క్ష‌ణ‌ను వ‌దిలేసి బ్యూటీ క్లాసులు పెట్టుకుంటే బాగుంటుంది అంటూ విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. త‌న వ్యాఖ్య‌లు వైర‌ల్ అవ‌డంతో గ‌విట్ క్లారిఫికేష‌న్ ఇచ్చారు. “” నేను గిరిజ‌నుల‌తో మాట్లాడుతున్నాను. గిరిజ‌నుల‌కు సింపుల్‌గా ఎగ్జాంపుల్స్ తీసుకుని చెప్తేనే అర్థం అవుతుంది. మీడియా త‌ప్పుగా ప్రచారం చేస్తోంది. నాకూ ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఐశ్వ‌ర్య రాయ్ కూడా నా కూతురు లాంటిదే. చేప‌లు, ఫిష్ ఆయిల్ లాభాల గురించి వివ‌రించ‌డం అంత సులువు కాదు. అందులోనూ గిరిజ‌నుల‌కు వివ‌రించ‌డం చాలా క‌ష్టం. అందుకే ఐశ్వ‌ర్య గురించి ప్ర‌స్తావించాను“”  అని క్లారిటీ ఇచ్చారు మంత్రి. (bjp minister)