Sonia Gandhi: మావారి కెరీర్ దారుణంగా ముగిసింది

త‌న భ‌ర్త రాజీవ్ గాంధీ (rajiv gandhi) కెరీర్ దారుణంగా ముగిసిపోయింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేసారు కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్య‌క్షురాలు సోనియా గాంధీ (sonia gandhi). ఆయ‌న కెరీర్ కొన్నేళ్ల పాటే ఉన్న‌ప్ప‌టికీ ఎన్నో చెప్పుకోద‌గ్గ ప‌నులు చేసార‌ని అన్నారు. రాజీవ్ గాంధీ 25వ జాతీయ స‌ద్భావ‌న అవార్డుల కార్యక్ర‌మంలో సోనియా పాల్గొన్నారు. “” మావారి కెరీర్ దారుణంగా ముగిసిపోయింది. ఆయ‌న రాజ‌కీయాల్లో కొంత‌కాలం పాటే ఉన్నప్ప‌టికీ ఎన్నో మ‌హిళల సాధికార‌తతో పాటు ఎన్నో విష‌యాల్లో మైలురాళ్లు అందుకున్నారు. పంచాయ‌త్, మున్సిప‌ల్ రిజ‌ర్వేష‌న్ల‌లో మ‌హిళ‌ల‌కు 1/3 వంతు కేటాయించాల‌ని పాటుప‌డ్డారు. ఈరోజు గ్రామీణ‌, ప‌ట్ట‌ణాల్లోని వార్డుల్లో 15 ల‌క్ష‌ల మంది మ‌హిళ‌లు ఉన్నారంటే అది రాజీవ్ గాంధీ ప‌డిన క‌ష్ట‌మే. ఓటు హక్కు వినియోగించుకునే వ‌య‌సును 21 నుంచి 18కి తీసుకొచ్చింది కూడా ఆయ‌నే “” అని వెల్ల‌డించారు సోనియా.