Chota K Naidu: పొన్నియిన్ సెల్వ‌న్‌పై షాకింగ్ కామెంట్స్

మ‌ణిర‌త్నం (maniratnam) తీసిన గ్రాండ్ సినిమా పొన్నియిన్ సెల్వ‌న్‌పై (ponniyin selvan) షాకింగ్ కామెంట్స్ చేసారు ప్ర‌ముఖ సినిమాటోగ్రాఫ‌ర్ చోటా కే నాయుడు (chota k naidu). మ‌ణిర‌త్నం సినిమాకు పెద్ద ఫ్యాన్ అయిన త‌న‌ను పొన్నియిన సెల్వ‌న్ డిస‌పాయింట్ చేసింద‌ని అన్నారు. ఆయ‌న సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న పెద‌కాపు (peda kapu) సినిమా గురించి  మాట్లాడుతూ పొన్నియిన్ సెల్వ‌న్ గురించి మాట్లాడారు చోటా కే నాయుడు.

“” సినిమా చూసే ఆడియ‌న్స్ ఎమెష‌న్స్‌ని స్క్రీన్‌పై కనిపించే క‌ల‌ర్, లైట్, షాట్స్, యాంగిల్స్‌తోనే క్యాప్చ‌ర్ చేయ‌గ‌లం. నేను ఈ విష‌యంలో చాలా శ్ర‌ద్ధ తీసుకుంటా. అందుకే ఇప్పుడు ఎంతో మంది యువ సినిమాటోగ్రాఫ‌ర్స్‌గా వ‌స్తున్నా కూడా నాకు పోటీ కాద‌నే అనుకుంటా. వారికి డెడికేష‌న్ లేదు. సినిమాటోగ్ర‌ఫీ అంటే ఏదో టెక్నిక‌ల్ వ‌ర్క్ అనుకుంటారు. నాకు అలా కాదు. సినిమాకు సినిమాటోగ్ర‌ఫీ ప‌నులు స్టార్ట్ చేసేముందు నేను కూడా 15 రోజుల పాటు స్క్రిప్ట్ బాగా చ‌దువుతాను. అస‌లు డైరెక్ట‌ర్ విజ‌న్ ఏంటో తెలుసుకుంటాను. లేదంటే సినిమా చూసిన‌ట్లే ఉండ‌దు. ఇక ఈ మ‌ధ్య‌కాలంలో నేను చూసిన బెస్ట్ సినిమాటోగ్ర‌ఫీ కేజీఎఫ్‌లో ఉంది. కానీ మ‌ణిర‌త్నం తీసిన పొన్నియిన్ సెల్వ‌న్ మాత్రం న‌న్ను డిస‌పాయింట్ చేసింది. ఆయ‌న సినిమాలో సినిమాటోగ్ర‌ఫీ అలా ఉంటుంద‌ని నేను అస్స‌లు అనుకోలేదు. నేను మ‌ణిర‌త్నం ఫ్యాన్‌ని. ఆయ‌న సినిమా రిలీజ్‌కి ముందే నేను స్పెష‌ల్ షో చూడ‌టానికి ఫ్లైట్‌లో చెన్నై వెళ్లి మ‌ళ్లీ సాయంత్రానికి తిరిగి వ‌చ్చేస్తాను. అన్ని విష‌యాల్లో ఎంతో కేర్‌ఫుల్‌గా ఉండే మ‌ణిర‌త్నం ఎందుకు సినిమాటోగ్ర‌ఫీలో ఇలా సాదాసీదాగా ఉన్నారో నాకు అర్థంకావ‌డంలేదు “” అని వెల్ల‌డించారు చోటా (chota k naidu)