Red Fort: ఖాళీ కుర్చీ..చీటీలో మెసేజ్..!

Delhi: 77వ స్వాతంత్ర్య దినోత్స‌వాన్ని (independence day) పుర‌స్క‌రించుకుని ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ (narendra modi) ఆగ్రాలోని ఎర్ర‌కోట‌లో (red fort) జెండా ఎగ‌ర‌వేసి ప్ర‌సంగించారు. అయితే మోదీ ప్ర‌సంగిస్తున్న ప్ర‌దేశంలో ఏర్పాటుచేసిన కుర్చీల్లో ఒక కుర్చీ అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది.  ఆ కుర్చీపై ఒక మెసేజ్ రాసిన పేప‌ర్ కూడా అతికించి ఉంది. ఆ కుర్చీని సీనియ‌ర్ కాంగ్రెస్ నేత మ‌ల్లికార్జున ఖ‌ర్గే (mallikarjun kharge) కోసం వేసారు. అయితే ఆయ‌న‌కు ఒంట్లో బాలేక‌పోవ‌డం వ‌ల్ల రాలేక‌పోతున్నాన‌ని ఒక చీటీలో రాసి దానిని ఆ కుర్చీకి త‌గిలించడం వైర‌ల్‌గా మారింది.